Anitha: మీటింగ్ లో ఉండగా బెదిరింపు కాల్.. స్పీకర్ ఆన్ చేసి అందరికీ వినిపించిన టీడీపీ నాయకురాలు అనిత!

  • విజయవాడలో మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
  • గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని ఫోన్ ద్వారా అనితకు బెదిరింపులు
  • తాను వాస్తవాలనే మాట్లాడుతున్నానన్న అనిత
TDP leader Anitha receives threat call

తెలుగుదేశం నాయకురాలు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు విజయవాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి అనిత హాజరయ్యారు. ఈ సమావేశం కొనసాగుతుండగా అనితకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

 హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని ఫోన్ చేసిన వ్యక్తి అనితను బెదిరించారు. తాను వాస్తవాలనే ప్రజలకు వివరిస్తున్నానని ఆమె సమాధానం ఇచ్చారు. మాధవ్ గురించి స్పందించాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్ ను స్పీకర్ ఆన్ చేసి అనిత అందరికీ వినిపించారు. 9848075369 నంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని ఆమె చెప్పారు.

More Telugu News