Foreigners: అక్టోబరు 15 నుంచి భారత్ వచ్చేందుకు విదేశీయులకు అనుమతి... చార్టర్డ్ విమానాల్లో మాత్రమే!

  • భారత్ లో బాగా తగ్గిన కరోనా వ్యాప్తి
  • 20 వేల దిగువన రోజువారీ కేసులు
  • ఆంక్షలు సడలిస్తున్న కేంద్రం
  • విదేశీయులకు వీసాలు జారీ చేయాలని నిర్ణయం
Central Govt decides to issue tourist visas to foreigners

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి అక్టోబరు 15 నుంచి విదేశీ పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు వీసాలు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే, విదేశీయులు చార్టర్డ్ విమానాల్లో వచ్చేందుకు మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుంది. సాధారణ విమానాల్లో రావడానికి నవంబరు 15 నుంచి అనుమతించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు అన్ని రకాల వీసాలను కేంద్రం గతేడాది నిలిపివేయడం తెలిసిందే.

More Telugu News