రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray Pays Tributes To Rajiv Gandhi
  • 1944 ఆగస్టు 20న జన్మించిన మాజీ ప్రధాని
  • ఈరోజు ఆయన 77వ జయంతి
  • ముఖ్యమంత్రి ఇంట్లోనే జరిగిన కార్యక్రమం
రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. 1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాజీవ్ గాంధీ అందుకున్నారు. ఆ తర్వాత తన 40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1944 ఆగస్టు 20 న జన్మించిన రాజీవ్ గాంధీ.. 1991 మే 21న తమిళనాడులో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో శ్రీపెరుంబదూర్‌లో ఉండగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) బృందానికి చెందిన ఆత్మాహుతి దళం చేసిన దాడిలో ఆయన మరణించారు.
Go Back to Shorts
Uddhav Thackeray
Rajiv Gandhi
Congress
Sivasena
Maharashtra

More Telugu News