Karthikeya: షూటింగు పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'

  • కార్తికేయ 'హీరోగా రాజా విక్రమార్క'
  • కథానాయికగా తాన్య రవిచంద్రన్ 
  • జోరుగా పోస్టు ప్రొడక్షన్ పనులు 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు     
Raja Vikramarka shooting completed

కార్తికేయ కథానాయకుడిగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క' సినిమా రూపొందుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ సినిమాను నిర్మిస్తున్న రామారెడ్డి తాజాగా ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుకొచ్చారు.

"సినిమా పరిశ్రమలో నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నేను ఈ సినిమాను నిర్మించాను. నిర్మాతగా నేను చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు కార్తికేయ అయితే బాగుంటాడని ఆయనను సంప్రదించడం జరిగింది. ఈ సినిమాలో ఆయన ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా కనిపిస్తాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫంక్షన్ కి చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాము. ఇక పై మా బ్యానర్లో వరుస సినిమాలు ఉంటాయి. నిర్మాణపరమైన విషయాల్లో రామానాయుడుగారే మాకు ఆదర్శం" అని చెప్పుకొచ్చారు నిర్మాత.

More Telugu News