G Jagadish Reddy: కోమటిరెడ్డి సోదరులకు డబ్బు సంపాదన పైనే ధ్యాస: మంత్రి జగదీశ్ రెడ్డి

  • వారిద్దరికీ ప్రజల్లో విశ్వసనీయత ఎప్పుడో పోయింది
  • సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారు
  • మీడియా ప్రచారం కోసం పాకులాడుతుంటారు
For Komatireddy brothers money is important says Jagadish Reddy

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ప్రజల్లో విశ్వసనీయత ఎప్పుడో పోయిందని జగదీశ్ రెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలే వారిని చీదరించుకుంటున్నారని చెప్పారు. మీడియా ప్రచారం కోసం పాకులాడటమే తప్ప... ప్రజలకు మేలు చేయాలనే తపన వారికి ఏనాడూ లేదని అన్నారు.
 
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎప్పుడూ డబ్బు సంపాదన పైనే ధ్యాస అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సమాజం అభివృద్ధి చెందాలనే తపన ఉంటే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల అమలుకు సహకరించాలని... లేకపోతే సొంత నియోజకవర్గ ప్రజల నుంచే వారికి వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు.

ఇంతకు ముందు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకునేది లేదని.. గుడ్డలు ఊడదీస్తానని హెచ్చరించారు. మీరు భయపెడితే భయపడటానికి తాము కాంగ్రెస్ నాయకులం కాదని చెప్పారు.

More Telugu News