Srivasa Reddy: 'ముగ్గురు మొనగాళ్లు' ట్రైలర్ రిలీజ్

  • వినోదమే ప్రధానంగా 'ముగ్గురు మొనగాళ్లు'
  • వరుస హత్యల చుట్టూ తిరిగే కథ
  • శ్రీనివాస రెడ్డి కామెడీ హైలైట్
  • ముఖ్య పాత్రలో టీఎన్నార్
Mugguru Monagallu Trailer Release

వినోద ప్రధానమైన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందువల్లనే హాస్యానికి దూరంగా తమ కథ వెళ్లకుండా హీరోలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వినోదభరితమైన సినిమా ఒకటి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'ముగ్గురు మొనగాళ్లు'. శ్రీనివాస రెడ్డి .. దీక్షిత్ శెట్టి .. వెన్నెల రామారావు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాకి, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రధాన పాత్రధారులలో ఒకరికి వినిపించదు ... ఒకరికి కనిపించదు .. మరొకరు మాట్లాడలేరనే విషయాన్ని పోస్టర్ ద్వారానే స్పష్టం చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కామెడీని .. సస్పెన్స్ ను కలిపి అందించిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. శ్రీనివాస్ రెడ్డి చేయి తిరిగిన కమెడియన్. ఆయన కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పచ్చు.

More Telugu News