Prabhas 21: ప్రభాస్ 21 నుంచి మరో అప్ డేట్ ఇదిగో!

  • మహానటి టీమ్ ను మళ్లీ పిలిచిన నాగ్ అశ్విన్
  • ప్రభాస్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా డానీ శాంచెజ్
  • సంగీత దర్శకుడిగా మికీ జే మేయర్
  • కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్
  • హీరోయిన్ గా దీపికా పదుకొణే
Update from Prabhas latest film

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజా చిత్రం అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ తన 21వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తుండగా, అందాలభామ దీపికా పదుకొణే కథానాయికగా ఎంపికైంది. తాజాగా చిత్ర యూనిట్ ఇతర టెక్నీషియన్ల వివరాలను ప్రకటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా డానీ శాంచెజ్-లోపెజ్, సంగీతదర్శకుడిగా మికీ జే మేయర్ వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించారు. వీరు గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రానికి కూడా పనిచేశారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. మునుపెన్నడూ కనిపించని రీతిలో ప్రభాస్ ను ఇందులో కొత్తగా చూపిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

More Telugu News