Vijay Sai Reddy: వింతల్లోకెల్ల వింత ఇది!: చంద్రబాబుకి విజయసాయిరెడ్డి చురక

  • తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శి
  • దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు
  • బీజేపీ గెలిస్తే టీడీపీ గెలిచినట్లు మురిసి పోతున్నారు
  • ఇంకొకరి గెలుపుతో పండుగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు 
vijaya sai slams chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ నేత రఘునందన్‌రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థి దొరకలేదని ఆయన ఆరోపించారు.

‘తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శికి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బీజేపీ గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్టు మురిసి పోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్ల వింత ఇది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

More Telugu News