హీరో సుశాంత్ సింగ్ ను రాజకీయాలే చంపేశాయి: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి
- బీహార్ ఎన్నికల కోసం సుశాంత్ కేసును బీజేపీ వాడుకుంటోంది
- సీబీఐ విచారణలో ఏమీ దొరకలేదు
- ఇప్పుడు డ్రగ్స్ మీద పడ్డారు
మరోవైపు సుశాంత్ ను రాజకీయాలే చంపేశాయని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల కోసం సుశాంత్ కేసును బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. సీబీఐ విచారణలో ఏదీ దొరక్కపోయేసరికి ఇప్పుడు డగ్స్ పై పడ్డారని అన్నారు. సీబీఐ, ఈడీలను పక్కనపెట్టి ఇప్పుడు ఎన్సీబీని రంగంలోకి దించారని చెప్పారు.
విచారణ పేరుతో ఒక్కొక్కరికి సమన్లు పంపుతున్నారని అధిర్ మండిపడ్డారు. ఎన్సీబీ విచారణలో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు? టెర్రరిస్టుల లింకులేమైనా బయటపడ్డాయా? అని ప్రశ్నించారు. సుశాంత్ ను ఎవరూ హత్య చేయలేదని... ఈ బుద్ధిలేని రాజకీయాలే చంపేశాయని అన్నారు.