విశాఖ జిల్లా టీడీపీ కమిటీలు.. వివరాలు ఇవిగో!
- పార్లమెంటరీ కమిటీల అధ్యక్షుల ఎంపిక
- విశాఖ కమిటీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరు ఖరారైనట్టు సమాచారం
- ప్రధాన కార్యదర్శిగా పట్టాభి
అరకు పార్లమెంటు నియోజకవర్గ కమిటీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టు సమాచారం. అనకాపల్లి కమిటీ అధ్యక్షుడిగా బుద్ధా నాగజగదీశ్వరరావు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే నియోజకవర్గ పరిధిలో వెలమ సామాజికవర్గం కీలకంగా ఉన్నందున వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.