Rhea Chakraborty: సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. ప్రియాంకపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా చక్రవర్తి!

  • సుశాంత్ సోదరిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు
  • బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని ఆరోపణ
  • ప్రియాంక, డాక్టర్ తరుణ్ లను విచారించాలని విన్నపం
Rhea Chakraborty Files Forgery Case Against Sushant Rajputs Sister

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై ఈ కేసులో ఆరోపణలు ఎందుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. సుశాంత్ కు సంబంధించి బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను ఇచ్చిందంటూ ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రిస్క్రిప్షన్ వచ్చిన ఐదు రోజుల్లోనే సుశాంత్ చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్ పై కూడా ఆరోపణలు చేసింది.

బోగస్ ప్రిస్క్రిప్షన్ లతో సుశాంత్ కు వైద్యం చేశారని... ఈ నేపథ్యంలో ప్రియాంక, తరుణ్ తదితరులను విచారించాల్సిన అవసరం ఉందని రియా తెలిపింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్ గా సుశాంత్ కు బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన జూన్ 8వ తేదీన సుశాంత్ ముంబైలోనే ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

More Telugu News