Chandrababu: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు

  • లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దుర్ఘటన
  • అగ్నికి ఆహుతైన రథం
  • ఘటన స్థలిని సందర్శించనున్న టీడీపీ కమిటీ సభ్యులు
TDP Chief Chandrababu appoints two members committee on Antarvedi incident

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రథం అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు సభ్యులుగా ఉంటారు. వీరిద్దరూ అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు.

More Telugu News