Aishwarya Rai: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఐశ్వర్య రాయ్

  • కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య
  • ఇంటికి చేరుకున్న తల్లీకుమార్తెలు
  • ఇంకా ఆసుపత్రిలోనే ఉన్న అమితాబ్, అభిషేక్
Asishwarya Rai discharged from hospital

ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాయ్ ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆసుపత్రిలో 10 రోజులు ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. తాజా పరీక్షల్లో ఆమెకు కోవిడ్ నెగెటివ్ అని తేలడంతో... ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తన భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యలకు టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని... ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారని తెలిపారు. తాను, తన తండ్రి అమితాబ్ ఇద్దరం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నామని చెప్పారు. అమితాబ్ ఇంట్లో ఆయన భార్య జయాబచ్చన్ మినహా మిగిలిన అందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

More Telugu News