Truck: ఈ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి ఏడాది పట్టింది!

  • 2019 జూలైలో నాసిక్ నుంచి బయల్దేరిన భారీ వాహనం
  • నాలుగు రాష్ట్రాల గుండా పయనం
  • రోజుకు 5 కిలోమీటర్ల ప్రయాణం
Heavy Truck started last year from Maharashtra has reached Kerala

అప్పుడప్పుడు జాతీయ రహదార్లపై వందల సంఖ్యలో టైర్లు ఉండే భారీ వాహనాలు దర్శనమిస్తుంటాయి. వాటిలో ఎంతో విలువైన యంత్ర సామగ్రి రవాణా చేస్తుంటారు. ఆ భారీ వాహనాలు చాలా నిదానంగా పయనిస్తాయి. ఈ వాహనం వాటికి జేజెమ్మ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే, మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి ఏడాది పట్టింది మరి! గతేడాది జూలై 8న మహారాష్ట్రలోని నాసిక్ లో బయల్దేరిన ఈ భారీ ట్రక్కు నిన్న కేరళలోని గమ్యస్థానం చేరుకుంది.

తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పరిశోధనలకు అవసరమైన అత్యాధునిక యంత్ర సామగ్రిని ఈ వాహనం మోసుకొచ్చింది. రాకెట్ తయారీకి అవసరమైన తక్కువ బరువుండే పదార్ధాన్ని రూపొందించే ఏరోస్పేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్ ను ఈ భారీ వాహనంపై తరలించారు. ఆ యంత్ర సామగ్రి బరువు 70 టన్నులు కాగా, అంత బరువును మోస్తూ ఈ ట్రక్కు రోజుకు 5 కిలోమీటర్ల చొప్పున నాలుగు రాష్ట్రాల గుండా పయనించి ఎట్టకేలకు తిరువనంతపురంలో ప్రవేశించింది. కాగా, ఈ ట్రక్కుపై 32 మంది సిబ్బంది కూడా ఉన్నారట.

More Telugu News