Bollywood: క‌రెంట్ బిల్ కట్టాలి.. కిడ్నీలు అమ్మేందుకు రెడీ!: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి

  • భారీగా కరెంటు బిల్లు వచ్చిందని వాపోయిన అర్షద్
  • తన ఇంటికి 1,03,564  రూపాయల బిల్ వ‌చ్చింద‌న్న నటుడు
  • తాను వేసిన పెయింటింగ్స్ అమ్ముకుంటానని సరదాగా ట్వీట్
  • వచ్చే డబ్బుతో విద్యుత్ బిల్ చెల్లిస్తాన‌ని వ్యాఖ్య
arshad about his powerbill

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల నెత్తిన విద్యుత్ బిల్లులు పిడుగులా పడుతోన్న విషయం తెలిసిందే. తమకు లక్షల రూపాయల్లో విద్యుత్తు బిల్లులు వస్తున్నాయంటూ కొందరు వాపోతున్నారు. ఈ జాబితాలోకి సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు.

తాజాగా,  బాలీవుడ్ నటుడు  అర్ష‌ద్ వార్సి త‌న ఇంటికి భారీ మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. తన ఇంటికి 1,03,564  రూపాయాల క‌రెంట్ బిల్ వ‌చ్చింద‌ని అర్షద్ చెప్పాడు. తాను వేసిన పెయింటింగ్స్ ను ఎవరైనా కొంటే వచ్చే డబ్బుతో ఈ విద్యుత్ బిల్ చెల్లిస్తాన‌ని ఆయన సరదాగా ట్వీట్ చేశాడు.

అయితే, ఆ తర్వాత వచ్చే విద్యుత్‌ బిల్‌ను చెల్లించడానికి మాత్రం తన రెండు కిడ్నీల‌ని అమ్మేందుకు సిద్ధ‌మ‌వుతున్నానని అన్నాడు. ఇప్పటికే దేశంలోని పలువురు సెలబ్రిటీలు తమకు వచ్చిన కరెంటు బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినీనటులు తాప్సీ, సందీప్ కిష‌న్‌ వంటి వారు తమకు వచ్చిన క‌రెంట్ బిల్లులపై షాక్ అవుతూ ట్వీట్లు చేశారు. సామాన్యులకు కూడా భారీ మొత్తంలో విద్యుత్‌ బిల్లులు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

More Telugu News