మైనర్లపై అఘాయిత్యం.. పాస్టర్కు నాలుగు మరణశిక్షలు
- నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్కు ఉరిశిక్ష
- నాలుగు కేసుల్లోనూ వేర్వేరుగా మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు
- బైబిల్ పాఠాల నెపంతో రెండేళ్లపాటు సాగిన అఘాయిత్యం
- బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశం
- తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఘటన
తమిళనాడులో సంచలనం సృష్టించిన ఓ పోక్సో కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఓ పాస్టర్కు నాలుగుసార్లు మరణశిక్ష విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని మేలా ఇలంతైకులం గ్రామంలో ఎస్.అబ్రహం (47) అనే వ్యక్తి ఓ ప్రార్థన మందిరాన్ని నడుపుతున్నాడు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో, కొవిడ్ లాక్డౌన్ సమయంలో.. నైతిక విలువలు, బైబిల్, కీర్తనలు నేర్పిస్తాననే నెపంతో తన వద్దకు వచ్చిన నలుగురు బాలికలను (8, 12, 12, 13 ఏళ్ల వయసు) లైంగికంగా వేధించాడు. పాస్టర్ అఘాయిత్యాల గురించి బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు 2022 జులై 5న అబ్రహంను అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన తిరునెల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ సురేష్ కుమార్, నిందితుడిని నాలుగు కేసుల్లోనూ దోషిగా నిర్ధారించారు. ప్రతి కేసుకు మరణశిక్ష చొప్పున మొత్తం నాలుగు మరణశిక్షలు విధించారు. దీంతో పాటు రూ. 52,000 జరిమానా కూడా విధించారు.
అంతేకాకుండా, బాధితురాలైన ప్రతి బాలికకు తమిళనాడు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు జరిపిన దర్యాప్తును కోర్టు ప్రశంసించింది.
జిల్లాలోని మేలా ఇలంతైకులం గ్రామంలో ఎస్.అబ్రహం (47) అనే వ్యక్తి ఓ ప్రార్థన మందిరాన్ని నడుపుతున్నాడు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో, కొవిడ్ లాక్డౌన్ సమయంలో.. నైతిక విలువలు, బైబిల్, కీర్తనలు నేర్పిస్తాననే నెపంతో తన వద్దకు వచ్చిన నలుగురు బాలికలను (8, 12, 12, 13 ఏళ్ల వయసు) లైంగికంగా వేధించాడు. పాస్టర్ అఘాయిత్యాల గురించి బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు 2022 జులై 5న అబ్రహంను అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన తిరునెల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ సురేష్ కుమార్, నిందితుడిని నాలుగు కేసుల్లోనూ దోషిగా నిర్ధారించారు. ప్రతి కేసుకు మరణశిక్ష చొప్పున మొత్తం నాలుగు మరణశిక్షలు విధించారు. దీంతో పాటు రూ. 52,000 జరిమానా కూడా విధించారు.
అంతేకాకుండా, బాధితురాలైన ప్రతి బాలికకు తమిళనాడు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు జరిపిన దర్యాప్తును కోర్టు ప్రశంసించింది.