Prabhas: అల్లు అరవింద్ .. కరణ్ జొహార్ నిర్మాణంలో ప్రభాస్

  • ప్రభాస్ నుంచి రొమాంటిక్ లవ్  స్టోరీ
  •  నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ చిత్రం
  •  మరో బహుభాషా చిత్రంలో ప్రభాస్  
Prabhas Movie

ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్  లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది.  'ఓ డియర్' .. 'రాధేశ్యామ్'  అనే టైటిల్స్ లో ఒకదానిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించే ఈ సినిమా కోసం అత్యధిక బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది.  

ఆ తరువాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో కూడినదే అనే టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ - కరణ్ జొహార్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. కథా వస్తువు ఏమిటి? దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు ..  తమిళ ..  మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News