Anushka Shetty: అనుష్క 'నిశ్శబ్దం' ట్రైలర్‌ ను విడుదల చేసిన నాని

  • మధుకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నిశ్శబ్దం’
  • కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణంలో సినిమా
  • అంజలి డైలాగులు అదుర్స్‌
NishabdhamTrailer Anushka Shetty

అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నిశ్శబ్దం’ సినిమా ట్రైలర్‌ ఈ రోజు హీరో నాని చేతుల మీదుగా విడుదలైంది. ‘మార్చి 6న మధ్యాహ్నం 12:12 గంటలకు’ విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించిన ఈ సినిమా బృందం సరిగ్గా అదే సమయానికి విడుదల చేసింది.
                                    
ఈ సినిమా  కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణంలో వస్తోంది. ఈ సినిమాలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అంజలి డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. 'నేను చెబుతోంది అర్థమవుతుందా?', 'ఓ ఘోస్ట్ ఇదంతా చేస్తోందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి నా సెన్సిబిలిటీస్‌ అంగీకరించలేదు' అంటూ ఆమె ఓ డైలాగ్ చెప్పింది.  

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌కు మంచి టాక్‌ వచ్చింది. ట్రైలర్ ను కూడా అంచనాలకు తగ్గట్లుగానే కట్‌ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ విడుదల కానుంది. వచ్చేనెల 2న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆ సినిమా బృందం ప్రకటించింది.

More Telugu News