ఒక్కరోజులో చైనా బయటి దేశాల్లో 1500 మందికి కరోనా... డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన!

Corona Virus expands in 64 countries
  • మృతుల సంఖ్య 24 నుంచి 128కి
  • మొత్తం 64 దేశాలకు విస్తరణ
  • వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
కేవలం ఒకే ఒక్క రోజులో చైనా మినహా మిగతా దేశాల్లో 1,500 మందికి కోవిడ్-19 (కరోనా) వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన ప్రకటన వెలువరించింది. ఇదే సమయంలో చైనాను వదిలేస్తే, మిగతా దేశాల్లో మరణించిన వారి సంఖ్య 24 నుంచి 128కి పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఇప్పటివరకూ మొత్తం 64 దేశాలకు వైరస్ విస్తరించిందని, ఈ దేశాల్లో 8,774 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తన నివేదికలో తెలిపింది. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితని అభిప్రాయపడింది.

ఈ దేశాల్లోని 60 ఏళ్ల పైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సులువుగా సోకుతుందని, వారు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధ్నామ్ గీభ్రీయేసూస్ హెచ్చరించారు.
Go Back to Shorts
Corona Virus
WHO
World Health Organisation
Report

More Telugu News