ఢిల్లీలో స్నేహితుడితో కలిసి చర్చికి వెళ్లిన తెలుగు లేడీ డాక్టర్ అదృశ్యం... భర్త ఫిర్యాదు!

ఢిల్లీ పోలీసులకు ఓ కేసు మిస్టరీగా మారింది. చర్చికి బయల్దేరిన ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు లేడీ డాక్టర్. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.... హిమబిందు, శ్రీధర్, దిలీప్ సత్య ముగ్గురూ వైద్యులు. కర్నూలులోని మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. హిమబిందు, శ్రీధర్ పెళ్లిచేసుకుని ఢిల్లీలో స్థిరపడగా, దిలీప్ సత్య చండీగఢ్ లో చిన్నపిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

అయితే, ఓ ఇంటర్వ్యూ కోసం పుదుచ్చేరి వెళ్లిన దిలీప్ సత్య తిరుగుప్రయాణంలో తన స్నేహితులైన హిమబిందు, శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగాడు. క్రిస్మస్ సందర్భంగా దిలీప్ సత్యతో చర్చికి వెళ్లి వస్తానని బయల్దేరిన హిమబిందు మళ్లీ ఇంటికి రాలేదు. ఆమెతో వెళ్లిన దిలీప్ సత్య ఆచూకీ కూడా తెలియరాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. దాంతో హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో ఈ కేసు పోలీసులకు ఓ పెద్ద సవాల్ గా మారింది.
Go Back to Shorts
Doctors
New Delhi
Dilip Sathya
Sreedhar
Himabindu
Police

More Telugu News