'టిక్‌టాక్' ఇండియా క్వీన్‌గా బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్

  • టిక్‌టాక్ రివైండ్ 2019 ప్రచారంలో మొదటి 50 కంటెంట్ వీడియోల జాబితా విడుదల
  • 9.5 మిలియన్ ఫాలోవర్లతో అగ్రస్థానం
  • నాలుగో స్థానానికి పరిమితమైన మాధురీ దీక్షిత్
బాలీవుడ్ ప్రముఖ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఈ ఏడాది ‘టిక్‌టాక్ ఇండియా క్వీన్’గా అవతరించింది. టిక్‌టాక్ రివైండ్ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్ వీడియోల జాబితాను విడుదల చేయగా జాక్విలిన్ 9.5 మిలియన్ ఫాలోవర్లతో బాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రితేశ్ దేశ్‌ముఖ్ 6.8 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలవగా, 2.2 మిలియన్ ఫాలోవర్లతో కపిల్ శర్మ, 1.2 మిలియన్ ఫాలోవర్లతో మాధురీ దీక్షిత్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Go Back to Shorts
jacqueline fernandez
Madhuri dixit
TikTok

More Telugu News