చేసిన తప్పులపై క్షమాపణలు చెప్పిన తర్వాతే టీడీపీ వాళ్లు సభలో అడుగుపెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి
- తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి
- సభలో చంద్రబాబు తీరు దారుణమంటూ వ్యాఖ్యలు
- సమస్యలపై చర్చించే ధైర్యం టీడీపీకి లేదని విమర్శలు
సభలో గొడవలు చేసేందుకే టీడీపీ అధిక సమయం వెచ్చిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీకాంత్ రెడ్డి, మార్షల్స్ తో చంద్రబాబు ప్రవర్తించిన తీరు వీడియోలో స్పష్టంగా ఉందని వెల్లడించారు. మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసిన తప్పులపై క్షమాపణ చెప్పిన తర్వాతే టీడీపీ సభ్యులు సభలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. వచ్చే రెండ్రోజులైనా సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.