మోదీని దూషించిన బాలికకు క్షమాభిక్ష.. కేసు నమోదు చేయని పోలీసులు
- ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక
- క్షమిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
- బాలికపై కేసు నమోదు చేయరాదని ఢిల్లీ పోలీసుల నిర్ణయం
- ఇది తన కుమార్తెకు ప్రధాని ఇచ్చిన జీవనదానం అన్న తల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలికపై కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. గత నెలలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనలో ఈ ఘటన చోటుచేసుకోగా, నోయిడా పోలీసులు తొలుత 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్లో బాలికను 25 ఏళ్ల యువతిగా పేర్కొన్నారు. అయితే, తాను 15 ఏళ్ల మైనర్ను అని, ఇతరుల ప్రభావంతో అలా మాట్లాడానని ఆ బాలిక తర్వాత క్షమాపణ వీడియో విడుదల చేసింది. "నన్ను క్షమించండి, ఇది నా మొదటి, చివరి తప్పు" అని వేడుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో "తప్పుదోవ పట్టిన పిల్లలు నన్ను దూషించినా క్షమిస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని క్షమించడం పట్ల బాలిక తల్లి హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తెకు ఇది పునర్జన్మ అని, ప్రధాని మోదీ జీవనదానం ప్రసాదించారని ఆమె అన్నారు. బాలికపై తప్పుడు వివరాలతో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, 18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను నిషేధించాలని కోరారు.
ఎఫ్ఐఆర్లో బాలికను 25 ఏళ్ల యువతిగా పేర్కొన్నారు. అయితే, తాను 15 ఏళ్ల మైనర్ను అని, ఇతరుల ప్రభావంతో అలా మాట్లాడానని ఆ బాలిక తర్వాత క్షమాపణ వీడియో విడుదల చేసింది. "నన్ను క్షమించండి, ఇది నా మొదటి, చివరి తప్పు" అని వేడుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో "తప్పుదోవ పట్టిన పిల్లలు నన్ను దూషించినా క్షమిస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని క్షమించడం పట్ల బాలిక తల్లి హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తెకు ఇది పునర్జన్మ అని, ప్రధాని మోదీ జీవనదానం ప్రసాదించారని ఆమె అన్నారు. బాలికపై తప్పుడు వివరాలతో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, 18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను నిషేధించాలని కోరారు.