వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్

YSRCP MLA Virupakshi gets 14 days remand
  • టీడీపీ నేతపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్
  • విరూపాక్షితో పాటు మరో 15 మంది వైసీపీ కార్యకర్తలకు కూడా కస్టడీ
  • ఇసుక వివాదం నేపథ్యంలో హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఆలూరు కోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులపై దాడికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. విరూపాక్షితో పాటు మరో 15 మంది వైసీపీ కార్యకర్తలను కూడా రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

గత కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక వివాదమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వివాద నేపథ్యంలో టీడీపీ నేతలపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు వారిని ఆలూరు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఎమ్మెల్యే విరూపాక్షికి, ఆయన అనుచరులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు వారిని స్థానిక జైలుకు తరలించారు.                      
Advertisement
Virupakshi
YSRCP MLA
Alur Court
TDP leader attack case
Judicial remand
Andhra Pradesh politics

More Telugu News