వైసీపీలో చేరేందుకే వల్లభనేని వంశీ నిర్ణయం?
- రెండు రోజుల క్రితం రాజీనామా
- జగన్ సమక్షంలో చేరిక
- వంశీ రాకను వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ
ఇదే సమయంలో వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, తన మనసులోని మాటను జగన్ తో చెప్పేందుకు ప్రయత్నించినా, ఆయన అపాయింట్ మెంట్ లభించలేదు. నిన్న జగన్ పార్టీకి చెందిన ఏ నేతనూ కలవలేదు. దీంతో జగన్ నివాసానికి వెళ్లి చాలాసేపు నిరీక్షించిన యార్లగడ్డ నిరాశతో వెనుతిరిగారు. వంశీ రాజీనామా చేసిన తరువాతనే వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నికలు వస్తే, ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీకి దిగాలని యార్లగడ్డ భావిస్తున్నట్టు తెలుస్తోంది.