చంకలు గుద్దుకోవడం కోసమే.. మతలబు అర్థమవుతోంది: లోకేశ్
- మ్యాక్స్ ఇన్ఫ్రాపై గతంలో సాక్షిలో వచ్చిన వార్తను పోస్టు చేసిన లోకేశ్
- అప్పుడు ఉట్టికి ఎగరలేని సంస్థ.. ఇప్పుడు స్వర్గానికి ఎలా ఎగురుతుందని ప్రశ్న
- ఒక్క శాతం కూడా పనులు చేయని సంస్థకు పనులా?
రూ.58 కోట్లు మిగిల్చామని చంకలు గుద్దుకోవడం కోసమే ఇలా చేస్తున్నారా? అని లోకేశ్ ప్రశ్నించారు. అప్పుడు ఉట్టికి ఎగరలేనమ్మ ఇప్పుడు స్వర్గానికి ఎగురుతుందా? అని నిలదీశారు. మార్చిలో పనులు దక్కించుకుని ఒక్క శాతం పనులు కూడా పూర్తిచేయలేకపోయిన సంస్థకు ఇప్పుడు పనులు అప్పగించడం విడ్డూరంగా ఉందని లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.