ఫలిస్తున్న మోదీ చాణక్యం.. కశ్మీర్ లో పెట్టుబడులకు ఫ్రాన్స్, యూఏఈ రెడీ!
- ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలతో మోదీ మంతనాలు
- అపార అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపు
- యూఏఈ పాలకులతో ప్రత్యేక భేటీ
ప్రస్తుతం జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న మోదీ, భూతల స్వర్గం కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రాన్స్ పారిశ్రామిక వేత్తలను కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఫ్రెంచ్ పెట్టుబడులకు భారత ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని మోదీ చెప్పారన్నాయి. ఇందుకు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అలాగే నిన్న యూఏఈకి చేరుకున్న మోదీ ఇదే విషయాన్ని ఆ దేశ పాలకుల ముందు ఉంచినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఇందుకు యూఏఈ పాలకులు తమ సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొన్నాయి. భారత్ జీ7 గ్రూపులో సభ్యదేశం కానప్పటికీ, ఫ్రాన్స్ ప్రత్యేక ఆహ్వానం నేపథ్యంలో మోదీ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.