కిందకు దిగిన జాక్ మా... ఆసియాలోనే కుబేరుడు ముఖేష్ అంబానీ!
- ఈ ఏడాది మరో 4 బిలియన్ డాలర్లు పెరిగిన ముఖేష్ సంపద
- 43.2 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆసియా కుబేరుడిగా గుర్తింపు
- 35 బిలియన్ డాలర్లకు తగ్గిన జాక్ మా సంపద
ఈ సంవత్సరం ఆసియాలోని 128 మంది ధనవంతుల ఆస్తుల విలువలో 137 బిలియన్ డాలర్లు కరిగిపోయాయని పేర్కొంది. గడచిన ఆరేళ్లలో ఆసియా సంపన్నుల సంపద తగ్గిపోవడం ఇదే తొలిసారని, వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, స్టాక్ మార్కెట్ పతనం ఇందుకు కారణమని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. చైనా, ఇండియా, దక్షిణ కొరియా దేశాల్లోని ధనవంతులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, 40 మంది చైనా కుబేరుల్లో మూడింట రెండొంతుల మంది సంపద కరిగిపోయిందని తెలిపింది. ఈ జాబితాలో ఇండియాకు చెందిన 23 మంది కుబేరులు ఉండగా, వారి సంపదలో 21 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.