ys jagan: రేపటి నుంచి ప్రజాసంకల్పయాత్ర తిరిగి ప్రారంభం.. విశాఖకు బయలుదేరిన జగన్
వైసీపీ అధినేత జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి ఘటన అనంతరం కొన్ని రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర వాయిదా పడ్డ విషయం తెలిసిందే. రేపటి నుంచి విజయనగరం జిల్లాలో జగన్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వైఎస్ జగన్ బయలుదేరారు. విశాఖకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గానికి ఆయన చేరుకుంటారని సమాచారం. రేపు మేలపువలస నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు.
మక్కువ క్రాస్, ములక్కాయ వలస, కాశీపట్నం క్రాస్, పాపయ్య వలస మీదుగా కొయ్యనపేట వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాల సమాచారం. కాగా, తన నివాసం నుంచి బయలు దేరిన జగన్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వైఎస్ జగన్ బయలుదేరారు. విశాఖకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గానికి ఆయన చేరుకుంటారని సమాచారం. రేపు మేలపువలస నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు.
మక్కువ క్రాస్, ములక్కాయ వలస, కాశీపట్నం క్రాస్, పాపయ్య వలస మీదుగా కొయ్యనపేట వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాల సమాచారం. కాగా, తన నివాసం నుంచి బయలు దేరిన జగన్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.