సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గ్లామర్ పాత్రలకు హన్సిక దూరం 
  • అఖిల్ 'మిస్టర్ మజ్ను' విడుదల తేదీ 
  • హీరోగా గీత రచయిత తనయుడు!
*  ఇటీవల తనకు తానుగానే సినిమాలు తగ్గించుకున్నానని చెబుతోంది అందాలతార హన్సిక. 'నాకు సినిమాలు తగ్గాయని అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు, నేనే తగ్గించుకున్నాను. ఇటీవల చాలా సినిమాలు వదిలేశాను, గ్లామర్ పాత్రలు చాలా చేశాను కాబట్టి, ఇప్పుడు వాటికి దూరంగా వుండాలని అనుకుంటున్నాను. అభినయానికి ప్రాధాన్యత వున్న సినిమాలు మాత్రమే చేస్తాను' అని చెప్పింది హన్సిక. ఇప్పటికి తాను ఏభై సినిమాలు చేసినట్టు తెలిపింది.
*  అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం 'మిస్టర్ మజ్ను'కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని జనవరి 24న రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించారు.
*  ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా వస్తున్నాడు. గోరంట్ల సాయినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పల్లెవాసి' చిత్రంలో రాకేందు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
Go Back to Shorts
Hansika
akhil
nidhi agarwal
vennelakanti

More Telugu News