హైదరాబాదుకు తరలిస్తున్న రూ. 10 కోట్ల నగదు స్వాధీనం
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పోలీసుల వాహన తనిఖీలు
- పిప్పరివాడ టోల్ ప్లాజా వద్ద కారులో నగదు గుర్తింపు
- మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు నగదు తరలింపు
మహారాష్ట్ర నాగ్ పూర్ జిల్లా నుంచి హైదరాబాదుకు ఈ నగదును తరలిస్తున్నట్టు గుర్తించారు. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉంది. నగదు మొత్తం రూ. 500 నోట్ల కట్టల రూపంలో ఉంది. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ సర్వేశ్, వినోద్ శెట్టిలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న వెంటనే రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీలకు సమాచారం ఇచ్చారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు.