ఏడాదిగా వేధింపులు.. కాలిఫోర్నియాలో నడిరోడ్డుపై భారత మహిళ దారుణ హత్య
- కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
- ఏడాదిగా వేధిస్తూ, కాల్చి చంపిన యువకుడు
- నిందితుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
- పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతోనే ఈ దారుణం
- కోర్టు ఆదేశాలున్నా ఆగని వేధింపులు
అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో నివాసముంటున్న 38 ఏళ్ల షాలినీ ఠాకూర్ను, గత ఏడాది కాలంగా వేధిస్తున్న ఓ యువకుడు నడిరోడ్డుపై కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల రోహిత్ అనే నిందితుడు షాలినీని వెంబడించి, అందరూ చూస్తుండగానే ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హత్య అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హైవే-50 వద్ద అతడిని గుర్తించి చుట్టుముట్టారు. ఆ సమయంలో రోహిత్ తన వద్దనున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిపై తాము ఎటువంటి కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
దాదాపు ఏడాది కాలంగా రోహిత్ తన కుమార్తెను నిరంతరం వేధిస్తున్నాడని షాలినీ తల్లి సుధేష్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని రోహిత్ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, అయితే వయసులో వ్యత్యాసం ఉండటంతో షాలినీ అందుకు నిరాకరించిందని తెలిపారు. అతడి వేధింపుల కారణంగా తన కుమార్తె గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనల మధ్య గడిపిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
కోర్టు రికార్డుల ప్రకారం, 2025 సెప్టెంబర్ నుంచి రోహిత్ వేధింపులు మొదలయ్యాయి. షాలినీ పనిచేసే చోట డోర్డాష్ పికప్ల ద్వారా అతడికి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇంటి వెలుపల గంటల తరబడి వేచి చూడటం, కారు టైర్లలో గాలి తీయడం, ఆమె కదలికలను పసిగట్టేందుకు కారుకు యాపిల్ ఎయిర్ ట్యాగ్ అమర్చడం వంటి చర్యలకు అతడు పాల్పడేవాడు. అంతేకాకుండా, షాలినీ ఫ్లాట్కు డూప్లికేట్ తాళం తయారు చేయించి, ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేవాడని సమాచారం. ఈ వేధింపులపై షాలినీ మే 19న కోర్టు నుంచి రిస్ట్రెయినింగ్ ఆర్డర్ కూడా పొందారు. అయినప్పటికీ నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్యకు గురవడానికి గంట ముందే షాలినీ తన తల్లితో ఫోన్లో మాట్లాడిందని, 15 నిమిషాల్లో తిరిగి కాల్ చేస్తానని చెప్పిన కూతురు ఇలా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల రోహిత్ అనే నిందితుడు షాలినీని వెంబడించి, అందరూ చూస్తుండగానే ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హత్య అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హైవే-50 వద్ద అతడిని గుర్తించి చుట్టుముట్టారు. ఆ సమయంలో రోహిత్ తన వద్దనున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిపై తాము ఎటువంటి కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
దాదాపు ఏడాది కాలంగా రోహిత్ తన కుమార్తెను నిరంతరం వేధిస్తున్నాడని షాలినీ తల్లి సుధేష్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని రోహిత్ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, అయితే వయసులో వ్యత్యాసం ఉండటంతో షాలినీ అందుకు నిరాకరించిందని తెలిపారు. అతడి వేధింపుల కారణంగా తన కుమార్తె గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనల మధ్య గడిపిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
కోర్టు రికార్డుల ప్రకారం, 2025 సెప్టెంబర్ నుంచి రోహిత్ వేధింపులు మొదలయ్యాయి. షాలినీ పనిచేసే చోట డోర్డాష్ పికప్ల ద్వారా అతడికి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇంటి వెలుపల గంటల తరబడి వేచి చూడటం, కారు టైర్లలో గాలి తీయడం, ఆమె కదలికలను పసిగట్టేందుకు కారుకు యాపిల్ ఎయిర్ ట్యాగ్ అమర్చడం వంటి చర్యలకు అతడు పాల్పడేవాడు. అంతేకాకుండా, షాలినీ ఫ్లాట్కు డూప్లికేట్ తాళం తయారు చేయించి, ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేవాడని సమాచారం. ఈ వేధింపులపై షాలినీ మే 19న కోర్టు నుంచి రిస్ట్రెయినింగ్ ఆర్డర్ కూడా పొందారు. అయినప్పటికీ నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్యకు గురవడానికి గంట ముందే షాలినీ తన తల్లితో ఫోన్లో మాట్లాడిందని, 15 నిమిషాల్లో తిరిగి కాల్ చేస్తానని చెప్పిన కూతురు ఇలా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.