యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
- ఉత్తరప్రదేశ్లోని బాఘ్పత్లో పికప్ వాహనం బోల్తా
- ప్రమాదంలో 12 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- రాజస్థాన్ నుంచి బదౌన్ వెళ్తుండగా అర్ధరాత్రి ఘటన
- డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
- మృతుల కుటుంబాల కోసం పోలీసులు హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాఘ్పత్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ పికప్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
రాజస్థాన్ నుంచి 32 మంది ప్రయాణికులతో బదౌన్కు బయలుదేరిన పికప్ వాహనం,. సోమవారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో ఖేక్డా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ప్రమాదానికి గురైంది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖేక్డా, బాఘ్పత్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మేల్కొనేలోపే వాహనం బోల్తా పడిందని క్షతగాత్రులు తెలిపారు.
అయితే, వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని డ్రైవర్ పేర్కొంటున్నాడు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని, బాధితుల కుటుంబ సభ్యుల సమాచారం కోసం 9454417383 నంబర్లో సంప్రదించాలని బాఘ్పత్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్ నుంచి 32 మంది ప్రయాణికులతో బదౌన్కు బయలుదేరిన పికప్ వాహనం,. సోమవారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో ఖేక్డా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ప్రమాదానికి గురైంది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖేక్డా, బాఘ్పత్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మేల్కొనేలోపే వాహనం బోల్తా పడిందని క్షతగాత్రులు తెలిపారు.
అయితే, వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని డ్రైవర్ పేర్కొంటున్నాడు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని, బాధితుల కుటుంబ సభ్యుల సమాచారం కోసం 9454417383 నంబర్లో సంప్రదించాలని బాఘ్పత్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.