శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య
- శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో విషాదం
- శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కుటుంబం ఆత్మహత్య
- మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి చూడగా... ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఆత్మహత్య చేసుకుని మృతి చెంది కనిపించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవిత్రమైన శ్రావణమాసంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇలాంటి విషాదం జరగడం స్థానికులను, భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.