నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు: ముగిసిన సాదిక్ ఖాన్ విచారణ

Sheikh Sadiq Khan interrogation ends in AE Nukaraju family suicide case
  • నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణ పూర్తి
  • సర్పవరం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని విచారించిన ప్రత్యేక బృందం
  • ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
కాకినాడ జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ పోలీసుల ప్రాథమిక విచారణ ముగిసింది. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం, నిందితుడిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో అతడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

వివరాల్లోకి వెళితే, నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న సాదిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రైలు మార్గం ద్వారా కాకినాడ జిల్లా మేడపాడుకు, అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నిందితుడిని విచారించింది. అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు సీఐలతో కూడిన ఈ బృందం.. సోమవారం ఉదయం నుంచి సాదిక్ ఖాన్‌ను పలు కోణాల్లో విచారించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి పాత్రపై కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. విచారణ ప్రక్రియ పూర్తికావడంతో, పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Sheikh Sadiq Khan
AE Nukaraju suicide case
Kakinada police investigation
Sarpavaram police station
Meerut arrest
Andhra Pradesh crime news

More Telugu News