మార్కెట్లకు ‘గ్లోబల్ టెన్షన్’.. 493 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- మార్కెట్లను వెంటాడిన భౌగోళిక ఉద్రిక్తతలు
- సెన్సెక్స్ 493 పాయింట్లు పతనం
- నిఫ్టీకి 132.75 పాయింట్ల నష్టం
- ఐటీ, రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి
- రాణించిన ఆటో రంగ షేర్లు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
సెన్సెక్స్ 493 పాయింట్ల నష్టంతో 77,235.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 132.75 పాయింట్లు పతనమై 24,154.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి 24,300 స్థాయి కీలక నిరోధంగా మారిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ స్థాయిని దాటితే 24,400-24,500 వరకు పుంజుకునే అవకాశం ఉందన్నారు. లేకపోతే అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.
నిఫ్టీలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.43 శాతం క్షీణించింది. స్మాల్క్యాప్ సూచీ మాత్రం పెద్దగా మార్పు లేకుండా ముగిసింది. రంగాల వారీగా ఐటీ, రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ను కిందకు లాగాయి. ఆటో రంగ సూచీ మాత్రం రాణించింది.
భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావాన్ని ఇన్వెస్టర్లు అంచనా వేస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉందని నిపుణులు తెలిపారు. దేశీయ ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా ముడిచమురు ధరలు అధికంగా ఉండడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఇవి కంపెనీల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
రూపాయి 95.67 వద్ద దాదాపు స్థిరంగా ట్రేడైంది. అయితే బలపడటానికి కరెన్సీకి సవాళ్లు కొనసాగుతున్నాయని నిపుణులు తెలిపారు. సమీప కాలంలో రూపాయి 95.25-95.85 మధ్య కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు.
సెన్సెక్స్ 493 పాయింట్ల నష్టంతో 77,235.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 132.75 పాయింట్లు పతనమై 24,154.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి 24,300 స్థాయి కీలక నిరోధంగా మారిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ స్థాయిని దాటితే 24,400-24,500 వరకు పుంజుకునే అవకాశం ఉందన్నారు. లేకపోతే అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.
నిఫ్టీలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.43 శాతం క్షీణించింది. స్మాల్క్యాప్ సూచీ మాత్రం పెద్దగా మార్పు లేకుండా ముగిసింది. రంగాల వారీగా ఐటీ, రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ను కిందకు లాగాయి. ఆటో రంగ సూచీ మాత్రం రాణించింది.
భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావాన్ని ఇన్వెస్టర్లు అంచనా వేస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉందని నిపుణులు తెలిపారు. దేశీయ ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా ముడిచమురు ధరలు అధికంగా ఉండడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఇవి కంపెనీల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
రూపాయి 95.67 వద్ద దాదాపు స్థిరంగా ట్రేడైంది. అయితే బలపడటానికి కరెన్సీకి సవాళ్లు కొనసాగుతున్నాయని నిపుణులు తెలిపారు. సమీప కాలంలో రూపాయి 95.25-95.85 మధ్య కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు.