'ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది'.. వరుణ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్!
- ఘన విజయం సాధించిన వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'
- తొలిరోజే రూ.10.2 కోట్లతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
- ఐదేళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలమన్న నాగబాబు
- కొడుకు సక్సెస్పై సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
- ఈ విజయం పూర్తిగా వరుణ్ కష్టార్జితమని గర్వంగా వెల్లడి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సుదీర్ఘకాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్-కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో ఘన విజయం సాధించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఈ బ్లాక్బస్టర్ విజయంపై ఆయన తండ్రి, నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
"గత ఐదేళ్లుగా అన్నీ చూస్తూనే ఉన్నాను. నా కొడుకు ఆ నిశ్శబ్దాన్ని, బాధను, నిరాశను తనలోనే మోశాడు. అయినా ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు. తన పేరు మీద హిట్లు లేవు, కేవలం వైఫల్యాలు మాత్రమే తనని పరీక్షిస్తూ వచ్చాయి. అది తనని ఎంతగా బాధపెట్టిందో నాకు తెలుసు, కానీ ఆ బాధను ఎప్పుడూ బయటకు చెప్పలేదు" అంటూ నాగబాబు తన మనసులోని మాటలను పంచుకున్నారు. తామిద్దరం మౌనంగానే ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్లమని, మాటల్లో చెప్పకుండానే ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునేవాళ్లమని ఆయన గుర్తుచేసుకున్నారు.
"ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది. ఒక బ్లాక్బస్టర్ విజయం దక్కింది. అయితే ఈ విజయం పూర్తిగా వాడిదే. వాడి పోరాటం, వాడి సహనం, వాడి కష్టం. నేను వాడి కెరీర్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు, ఏ క్రెడిట్ తీసుకోలేదు. నిన్నటి వైఫల్యాలు ఎలాగో తనవేనో, ఈ రోజు ఈ విజయం కూడా పూర్తిగా తనదే" అంటూ తండ్రిగా తనకెంతో గర్వంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు.
"కంగ్రాట్స్ బంగారు.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అంటూ వరుణ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఈ విజయానికి కారణమైన దర్శకుడు మేర్లపాక గాంధీ, నటుడు సత్య, నటి రితికా నాయక్, నిర్మాత రాజీవ్, సంగీత దర్శకుడు తమన్తో పాటు చిత్ర బృందం మొత్తానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కథను నమ్మి, అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.
"గత ఐదేళ్లుగా అన్నీ చూస్తూనే ఉన్నాను. నా కొడుకు ఆ నిశ్శబ్దాన్ని, బాధను, నిరాశను తనలోనే మోశాడు. అయినా ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు. తన పేరు మీద హిట్లు లేవు, కేవలం వైఫల్యాలు మాత్రమే తనని పరీక్షిస్తూ వచ్చాయి. అది తనని ఎంతగా బాధపెట్టిందో నాకు తెలుసు, కానీ ఆ బాధను ఎప్పుడూ బయటకు చెప్పలేదు" అంటూ నాగబాబు తన మనసులోని మాటలను పంచుకున్నారు. తామిద్దరం మౌనంగానే ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్లమని, మాటల్లో చెప్పకుండానే ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునేవాళ్లమని ఆయన గుర్తుచేసుకున్నారు.
"ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది. ఒక బ్లాక్బస్టర్ విజయం దక్కింది. అయితే ఈ విజయం పూర్తిగా వాడిదే. వాడి పోరాటం, వాడి సహనం, వాడి కష్టం. నేను వాడి కెరీర్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు, ఏ క్రెడిట్ తీసుకోలేదు. నిన్నటి వైఫల్యాలు ఎలాగో తనవేనో, ఈ రోజు ఈ విజయం కూడా పూర్తిగా తనదే" అంటూ తండ్రిగా తనకెంతో గర్వంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు.
"కంగ్రాట్స్ బంగారు.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అంటూ వరుణ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఈ విజయానికి కారణమైన దర్శకుడు మేర్లపాక గాంధీ, నటుడు సత్య, నటి రితికా నాయక్, నిర్మాత రాజీవ్, సంగీత దర్శకుడు తమన్తో పాటు చిత్ర బృందం మొత్తానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కథను నమ్మి, అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.