ఇంగ్లిష్ విద్య అవసరం: మదర్సాలపై మాధవీలత కీలక వ్యాఖ్యలు
- మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి చేయాలన్న మాధవీలత
- జాతీయ గీతంతో పాటు ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టాలని సూచన
- విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- 'భారత్ మాతాకీ జై' అని నినదించేలా వారికి నేర్పించాలని డిమాండ్
బీజేపీ నేత మాధవీలత మదర్సాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మదర్సాలలో జాతీయ గీతం 'జన గణ మన', జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారికి ఆంగ్ల విద్యను కూడా అందించాలని సూచించారు.
హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ, "ఇది కేవలం మద్దతు తెలపాల్సిన విషయం కాదు. వాస్తవాలను గుర్తించాల్సిన అంశం. మదర్సాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి. అక్కడి పిల్లలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి. వారిలో దేశభక్తిని పెంపొందించాలి. వందేమాతరంతో పాటు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి. 'భారత్ మాతాకీ జై' అని నినదించేలా విద్యార్థులను సిద్ధం చేయాలి" అని పేర్కొన్నారు.
విద్యాసంస్థలలో వందేమాతరం ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా గుర్తింపు పొందిన మదర్సాలలో వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు కలకత్తా హైకోర్టులో సవాలు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ, "ఇది కేవలం మద్దతు తెలపాల్సిన విషయం కాదు. వాస్తవాలను గుర్తించాల్సిన అంశం. మదర్సాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి. అక్కడి పిల్లలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి. వారిలో దేశభక్తిని పెంపొందించాలి. వందేమాతరంతో పాటు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి. 'భారత్ మాతాకీ జై' అని నినదించేలా విద్యార్థులను సిద్ధం చేయాలి" అని పేర్కొన్నారు.
విద్యాసంస్థలలో వందేమాతరం ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా గుర్తింపు పొందిన మదర్సాలలో వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు కలకత్తా హైకోర్టులో సవాలు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేసిన విషయం తెలిసిందే.