అక్కడకు హరీశ్ రావు ఎందుకు వెళ్లారు?: మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు

Mahesh Kumar Goud sensational allegations on Harish Rao temple visits
  • బీఆర్ఎస్‌కు క్షుద్రపూజలు చేయడం అలవాటని టీపీసీసీ చీఫ్ ఆరోపణ
  • మాజీ మంత్రి హరీశ్ రావు ఆలయాల పర్యటనలపై ప్రశ్నలు
  • జూన్ 2, జులై 23 తేదీల్లో హరీశ్ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్
  • పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్న మహేష్ గౌడ్
  • తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీకి క్షుద్రపూజలు చేయడం ఒక అలవాటుగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఇటీవల కొన్ని ఆలయాలను సందర్శించడంపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడారు.

జూన్ 2న తిరుచ్చి, జులై 23న శివమొగ్గకు హరీశ్ రావు ఎందుకు వెళ్లారని ఆయన నిలదీశారు. ఆయా తేదీల్లో హరీశ్ రావు ఎక్కడ ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలకు సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని మహేశ్ గౌడ్ వెల్లడించారు.

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని, అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల నమ్మకాన్ని బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. చేసిన తప్పులకు గాను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Mahesh Kumar Goud
Harish Rao
TPCC President
BRS Party
Telangana Politics
Black Magic Allegations

More Telugu News