లష్కర్ బోనాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు

CM Revanth Reddy at Lashkar Bonalu offers silk clothes to Mahankali Ammavaru
  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
  • ప్రభుత్వం తరఫున జగన్మాతకు పట్టువస్త్రాలు, బోనం సమర్పణ
  • ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క
  • అంగరంగ వైభవంగా జరుగుతున్న లష్కర్ బోనాల జాతర
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Revanth Reddy
Lashkar Bonalu
Secunderabad Ujjaini Mahankali Temple
Telangana Bonalu Festival
Mahankali Ammavaru
Telangana CM Bonalu Puja

More Telugu News