సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇకలేరు
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచిన నేత
- కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953, జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం, కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం సాగించిన ఉద్యమాలతో రాష్ట్రవ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో అనేక పార్టీలలో పనిచేసిన ఆయన, ఇటీవలి కాలంలో వైసీపీలో చేరి, ఆ పార్టీలోనే కొనసాగారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ, 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నుంచి గెలిచారు. అనంతరం 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీతో విభేదించి ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో సొంత పార్టీలు స్థాపించారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు.
రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఆయన అనేక పోరాటాలు, దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా, 2016లో తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన 'కాపు ఐక్య గర్జన' సభ, తదనంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ వైఖరి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించడంతో, తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ముద్రగడ తన పేరును 'ముద్రగడ పద్మనాభరెడ్డి'గా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు.
గత ఏడాది కాలంగా వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ముద్రగడకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953, జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం, కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం సాగించిన ఉద్యమాలతో రాష్ట్రవ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో అనేక పార్టీలలో పనిచేసిన ఆయన, ఇటీవలి కాలంలో వైసీపీలో చేరి, ఆ పార్టీలోనే కొనసాగారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ, 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నుంచి గెలిచారు. అనంతరం 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీతో విభేదించి ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో సొంత పార్టీలు స్థాపించారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు.
రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఆయన అనేక పోరాటాలు, దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా, 2016లో తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన 'కాపు ఐక్య గర్జన' సభ, తదనంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ వైఖరి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించడంతో, తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ముద్రగడ తన పేరును 'ముద్రగడ పద్మనాభరెడ్డి'గా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు.
గత ఏడాది కాలంగా వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ముద్రగడకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.