రోహిత్ వస్తే ఇంగ్లండ్ ప్లాన్ మార్చుకోవాల్సిందే.. నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రోహిత్ రాకతో భారత్కు భారీ బలమన్న నాయర్
- షార్ట్పిచ్ బంతులను రోహిత్ బాగా ఎదుర్కొంటాడని విశ్లేషణ
- ఇంగ్లండ్ వ్యూహం మారుతుందని నాయర్ అంచనా
- బుమ్రాను జాగ్రత్తగా వినియోగించాలని సూచన
- మూడు వన్డేల్లో రెండు మ్యాచ్లే ఆడించాలని అభిప్రాయం
- కుల్దీప్కు వరుస అవకాశాలు ఇవ్వాలని సూచన
ఇంగ్లండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ పునరాగమనం భారత జట్టుకు పెద్ద బలమని మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ముఖ్యంగా షార్ట్పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. అతని రాకతో భారత బ్యాటింగ్ మరింత పటిష్ఠంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.
టీ20 సిరీస్లో భారత బ్యాటర్లకు షార్ట్పిచ్ బంతులు పెద్ద సవాల్గా మారాయని నాయర్ గుర్తు చేశాడు. అయితే అలాంటి బంతులపై రోహిత్ శర్మ భారీగా పరుగులు సాధించే బ్యాటర్ అని అన్నాడు. సెనా దేశాల్లో విజయవంతం కావాలంటే వేగాన్ని, షార్ట్పిచ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ రూపంలో భారత్కు అదే బలం లభిస్తుందని పేర్కొన్నాడు.
రోహిత్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ప్రత్యర్థులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుందని నాయర్ వ్యాఖ్యానించాడు. గొప్ప ఆటగాళ్లు తమ ఆటను మార్చుకోరని, ప్రత్యర్థులనే వ్యూహం మార్చేలా చేస్తారని చెప్పాడు. పెద్ద సిరీస్లు, కీలక టోర్నీల్లో రోహిత్ అనుభవం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని వెల్లడించాడు.
జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడంపైనా నాయర్ స్పందించాడు. అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. అయితే పనిభారాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని, ఈ మూడు వన్డేల్లో బుమ్రా రెండు మ్యాచ్లకు మించి ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. అలాగే కుల్దీప్ యాదవ్కు ఇంగ్లండ్ పరిస్థితులు అనుకూలిస్తాయని, అతడికి వరుస అవకాశాలు ఇస్తే అత్యుత్తమ ప్రదర్శన చేసే సామర్థ్యం ఉందని నాయర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
టీ20 సిరీస్లో భారత బ్యాటర్లకు షార్ట్పిచ్ బంతులు పెద్ద సవాల్గా మారాయని నాయర్ గుర్తు చేశాడు. అయితే అలాంటి బంతులపై రోహిత్ శర్మ భారీగా పరుగులు సాధించే బ్యాటర్ అని అన్నాడు. సెనా దేశాల్లో విజయవంతం కావాలంటే వేగాన్ని, షార్ట్పిచ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ రూపంలో భారత్కు అదే బలం లభిస్తుందని పేర్కొన్నాడు.
రోహిత్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ప్రత్యర్థులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుందని నాయర్ వ్యాఖ్యానించాడు. గొప్ప ఆటగాళ్లు తమ ఆటను మార్చుకోరని, ప్రత్యర్థులనే వ్యూహం మార్చేలా చేస్తారని చెప్పాడు. పెద్ద సిరీస్లు, కీలక టోర్నీల్లో రోహిత్ అనుభవం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని వెల్లడించాడు.
జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడంపైనా నాయర్ స్పందించాడు. అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. అయితే పనిభారాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని, ఈ మూడు వన్డేల్లో బుమ్రా రెండు మ్యాచ్లకు మించి ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. అలాగే కుల్దీప్ యాదవ్కు ఇంగ్లండ్ పరిస్థితులు అనుకూలిస్తాయని, అతడికి వరుస అవకాశాలు ఇస్తే అత్యుత్తమ ప్రదర్శన చేసే సామర్థ్యం ఉందని నాయర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.