వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం... సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
- వియత్నాం బోటు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసుల మృతి
- ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- బాధితులను ఆదుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
- మృతదేహాల తరలింపునకు చర్యలు చేపట్టాలని సూచన
వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విహార యాత్రకు వెళ్లి రాష్ట్ర వాసులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వివరాల్లోకి వెళితే, ఓ మొబైల్ కంపెనీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 33 మంది పర్యాటకులు వియత్నాం వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిలో 19 మంది ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ఈ దురదృష్టకర ఘటనలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. మిగిలిన 16 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి కావాల్సిన సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
కాగా, ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఏపీ వాసులను గుర్తించారు. కడపకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన గెల్లి జయశ్రీ, హిందూపురం వాసి నల్లపేట రవితేజ ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే, ఓ మొబైల్ కంపెనీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 33 మంది పర్యాటకులు వియత్నాం వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిలో 19 మంది ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ఈ దురదృష్టకర ఘటనలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. మిగిలిన 16 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి కావాల్సిన సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
కాగా, ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఏపీ వాసులను గుర్తించారు. కడపకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన గెల్లి జయశ్రీ, హిందూపురం వాసి నల్లపేట రవితేజ ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.