బంగ్లాదేశీ చొరబాటుదారులు తక్షణమే పారిపోండి: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి

Suvendu Adhikari Warns Bangladeshi Infiltrators to Flee West Bengal
  • బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి డెడ్లీ వార్నింగ్
  • మిమ్మల్ని జైళ్లలో పెట్టి, తిండి పెట్టి పోషించడం మాకు ఇష్టం లేదని వ్యాఖ్య
  • చొరబాటుదారులను గుర్తించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, అంతర్గత భద్రతా వ్యవహారాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ వలసదారులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ చొరబాటుదారులను ఏరిపారేసే చర్యలను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశిస్తూ.. "బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైనా ఉంటే వేగంగా ఇక్కడి నుంచి పారిపోండి. మిమ్మల్ని జైళ్లలో పెట్టి, మా ప్రజాధనంతో తిండి పెట్టి పోషించడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా డబ్బును ఎందుకు వృథా చేయాలి?" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


బీజేపీ ప్రధాన ఎన్నికల హామీలలో ఒకటైన అక్రమ వలసదారుల ఏరివేతపై ఇప్పుడు సువేందు సర్కార్ పూర్తిస్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చొరబాటుదారులను గుర్తించి, వారిని నిర్బంధించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులతో పాటు రోహింగ్యాలను కూడా కచ్చితంగా గుర్తించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నిర్బంధ కేంద్రాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను తక్షణమే అన్వేషించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.


ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇచ్చిన ఈ గట్టి వార్నింగ్‌తో పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాలైన ఉత్తర 24 పరగణాలు, మాల్దా వంటి ప్రాంతాలలో అప్పుడే చలనం మొదలైంది. చాలామంది అక్రమ వలసదారులు తమ సొంత దేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి సరిహద్దుల వైపునకు కదులుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పట్టుబడిన చొరబాటుదారుల గుర్తింపును నిర్ధారించిన తర్వాత, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి వారిని తిరిగి బంగ్లాదేశ్ పంపివేయడానికి ప్రభుత్వం సర్వసిద్ధం అవుతోంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మరోసారి అక్రమ వలసల అంశంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Go Back to Shorts
Suvendu Adhikari
West Bengal
Bangladesh infiltrators
illegal immigrants
Rohingya
border security
India Bangladesh border
national security
immigration
detention centers

More Telugu News