‘నా పేరు కరసామి’.. పవర్ఫుల్ డైలాగ్స్తో ధనుష్ ‘కర’ టీజర్ రిలీజ్
- ధనుష్ హీరోగా నటించిన ‘కర’ తెలుగు టీజర్ విడుదల
- ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా రిలీజ్
- ఇంటెన్స్ డైలాగ్స్, లుక్స్తో ఆకట్టుకుంటున్న ధనుష్
- విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్
- జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణ
విలక్షణ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టీజర్ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, పవర్ఫుల్ డైలాగ్స్తో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ పతాకాలపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
టీజర్లో వినిపించిన డైలాగ్స్ సినిమా కథాంశాన్ని, హీరో పాత్ర తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ‘‘పంటో.. గడ్డో, పాపమో.. పుణ్యమో, తను నాటింది.. తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది. అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి. నా పేరు కరసామి’’ అంటూ ధనుష్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. తనపై పడిన నిందను తుడిచివేసి, తన వారిని కాపాడుకునే ఓ యువకుడి ప్రయాణమే ఈ సినిమా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టైటిల్ పాత్ర పోషిస్తున్న ధనుష్, ఇందులో పలు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఒకవైపు సమస్యలతో సతమతమయ్యే యువకుడిగా, మరోవైపు ఎమోషన్స్ను అదుపులో పెట్టుకున్న పరిణతి చెందిన వ్యక్తిగా ఆయన నటనలో వేరియేషన్స్ ఆకట్టుకోనున్నాయి.
కుష్మిత గణేష్ సమర్పణలో డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధనుష్ సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన టీజర్తో సినిమాపై బజ్ మరింత పెరిగింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్కు ప్రధాన బలంగా నిలిచింది. థేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ విజువల్స్ను మరో స్థాయిలో నిలబెట్టింది.
కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
టీజర్లో వినిపించిన డైలాగ్స్ సినిమా కథాంశాన్ని, హీరో పాత్ర తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ‘‘పంటో.. గడ్డో, పాపమో.. పుణ్యమో, తను నాటింది.. తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది. అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి. నా పేరు కరసామి’’ అంటూ ధనుష్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. తనపై పడిన నిందను తుడిచివేసి, తన వారిని కాపాడుకునే ఓ యువకుడి ప్రయాణమే ఈ సినిమా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టైటిల్ పాత్ర పోషిస్తున్న ధనుష్, ఇందులో పలు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఒకవైపు సమస్యలతో సతమతమయ్యే యువకుడిగా, మరోవైపు ఎమోషన్స్ను అదుపులో పెట్టుకున్న పరిణతి చెందిన వ్యక్తిగా ఆయన నటనలో వేరియేషన్స్ ఆకట్టుకోనున్నాయి.
కుష్మిత గణేష్ సమర్పణలో డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధనుష్ సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన టీజర్తో సినిమాపై బజ్ మరింత పెరిగింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్కు ప్రధాన బలంగా నిలిచింది. థేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ విజువల్స్ను మరో స్థాయిలో నిలబెట్టింది.
కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.