ఫార్చ్యూన్ ఆయిల్ కంపెనీకి భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!
- ఫార్చ్యూన్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్కు జరిమానా
- సన్ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ల లోపం ఉన్నట్టు గుర్తింపు
- ఉత్పత్తి నాణ్యతలేనిదిగా ప్రకటించిన ఆహార భద్రతా సంస్థ
- నూనె సురక్షితమేనని, న్యాయపోరాటం చేస్తామని కంపెనీ వెల్లడి
ప్రముఖ వంట నూనెల బ్రాండ్ ఫార్చ్యూన్ తయారీ సంస్థ, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జరిమానా విధించింది. ఫార్చ్యూన్ బ్రాండ్కు చెందిన సన్ఫ్లవర్ ఆయిల్లో నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు లోపించాయని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు చేపట్టింది.
గోవాలోని తాజ్ ఫోర్ట్ అగ్వాడా రిసార్ట్ అండ్ స్పా నుండి సేకరించిన ఒక లీటర్ 'ఫార్చ్యూన్ ఫ్రయోలా' రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నమూనాను ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్లో పరీక్షించారు. ఈ పరీక్షల్లో నూనెలో ఉండాల్సిన విటమిన్-ఏ, విటమిన్-డి స్థాయిలు నిర్దేశిత పరిమితుల కంటే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆహార భద్రతా, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం, ఈ ఉత్పత్తిని 'నాణ్యతలేనిది'గా అధికారులు వర్గీకరించారు.
ఈ ఫలితాలపై సదరు సంస్థ అప్పీల్ చేయడంతో, ఆ నమూనాను మరో రిఫరల్ ల్యాబొరేటరీలో పునఃపరీక్షించారు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ విటమిన్-డి స్థాయి తక్కువగా ఉన్నట్లు ధ్రువీకరణ కావడంతో ప్రాసిక్యూషన్కు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో, గోవాలోని అడ్జుడికేటింగ్ అధికారి కంపెనీపై జరిమానా విధించారు. అయితే, జరిమానా మొత్తాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ అంశంపై ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ స్పందిస్తూ, తమకు ఇంకా అధికారిక ఉత్తర్వుల కాపీ అందలేదని పేర్కొంది. ఇది కేవలం విటమిన్ల స్థాయికి సంబంధించిన అంశమేనని, ఉత్పత్తి భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, ఈ నూనె వినియోగానికి పూర్తి సురక్షితమని స్పష్టం చేసింది. నిల్వ చేసే విధానం, కాంతి, కాలపరిమితి వంటి కారణాల వల్ల విటమిన్ల స్థాయి మారే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ఆర్డర్ను సమీక్షించిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ వివరించింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇటీవల కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
గోవాలోని తాజ్ ఫోర్ట్ అగ్వాడా రిసార్ట్ అండ్ స్పా నుండి సేకరించిన ఒక లీటర్ 'ఫార్చ్యూన్ ఫ్రయోలా' రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నమూనాను ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్లో పరీక్షించారు. ఈ పరీక్షల్లో నూనెలో ఉండాల్సిన విటమిన్-ఏ, విటమిన్-డి స్థాయిలు నిర్దేశిత పరిమితుల కంటే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆహార భద్రతా, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం, ఈ ఉత్పత్తిని 'నాణ్యతలేనిది'గా అధికారులు వర్గీకరించారు.
ఈ ఫలితాలపై సదరు సంస్థ అప్పీల్ చేయడంతో, ఆ నమూనాను మరో రిఫరల్ ల్యాబొరేటరీలో పునఃపరీక్షించారు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ విటమిన్-డి స్థాయి తక్కువగా ఉన్నట్లు ధ్రువీకరణ కావడంతో ప్రాసిక్యూషన్కు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో, గోవాలోని అడ్జుడికేటింగ్ అధికారి కంపెనీపై జరిమానా విధించారు. అయితే, జరిమానా మొత్తాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ అంశంపై ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ స్పందిస్తూ, తమకు ఇంకా అధికారిక ఉత్తర్వుల కాపీ అందలేదని పేర్కొంది. ఇది కేవలం విటమిన్ల స్థాయికి సంబంధించిన అంశమేనని, ఉత్పత్తి భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, ఈ నూనె వినియోగానికి పూర్తి సురక్షితమని స్పష్టం చేసింది. నిల్వ చేసే విధానం, కాంతి, కాలపరిమితి వంటి కారణాల వల్ల విటమిన్ల స్థాయి మారే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ఆర్డర్ను సమీక్షించిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ వివరించింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇటీవల కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.