భారత్‌తో టెస్ట్ సిరీస్: అభిమానులకు శ్రీలంక బోర్డు బంపరాఫర్

Sri Lanka Board offers bumper gift to fans for India Test series
  • భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లకు ఉచిత ప్రవేశం
  • శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన
  • గాలె, కొలంబోలలో జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్‌లు
  • ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సిరీస్
క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) బోర్డు తీపి కబురు అందించింది. భారత్‌తో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27లో భాగంగా జరగనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలె అంతర్జాతీయ స్టేడియంలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌ మైదానంలో జరగనున్నాయి. ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక ద్వారాలను కేటాయించారు. గాలె స్టేడియంలో గేట్ నెంబర్ 4 ద్వారా, కొలంబో స్టేడియంలో గేట్లు నెంబర్లు 3, 4, 5, 7 ద్వారా ప్రేక్షకులను అనుమతిస్తారు.

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉండగా, శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో శ్రీలంక పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, యువ క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మ్యాచ్‌లకు హాజరు కావాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది.
Advertisement
Sri Lanka Cricket
India vs Sri Lanka Test Series
Free entry for cricket fans
World Test Championship 2025-27
Galle International Stadium

More Telugu News