గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో!
రోడ్డు పక్కన తోపుడు బండిపై బంగారు ఆభరణాలు, నాణేలు విక్రయిస్తున్నారు. విశాఖపట్నంలో కనిపించిన ఈ దృశ్యం స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ జ్యువెలరీ సంస్థ చేసిన ఈ వినూత్న మార్కెటింగ్ ప్రయోగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా, అచ్చం ఐస్క్రీమ్ బండిలా కనిపించేలా ఓ సెటప్ను ఏర్పాటు చేశారు. ‘గోల్డ్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రారంభించిన ఈ బండి వద్దకు వచ్చిన వారికి, ఐస్క్రీమ్ ఇచ్చినట్లుగా బంగారాన్ని అందిస్తున్నారు. పాత రోజుల్లో రోడ్లపైనే బంగారం అమ్మేవారనే కాన్సెప్ట్తో ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ బండిని చూసిన జనం ఆసక్తిగా అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ బండిపై కేవలం రూ.800కే బంగారు నాణెం అందిస్తుండటం విశేషం. దీనిపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు కూడా లేవని చెబుతున్నారు. దాంతో చాలామంది ఆసక్తిగా కొనుగోలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఈ బండిపై కేవలం తక్కువ విలువైన బంగారు వస్తువులను మాత్రమే విక్రయానికి ఉంచారు. ఖరీదైన ఆభరణాలన్నీ షోరూమ్లలోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ నెల 11, 12 తేదీల్లో ఈ బండిని ఏర్పాటు చేయగా, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మళ్లీ 18, 19, 20 తేదీల్లో కూడా అందుబాటులో వుంచుతామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ విక్రయాలు జరుపుతున్నారు. కాగా, ఈ బండిపై బంగారం అమ్మకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా, అచ్చం ఐస్క్రీమ్ బండిలా కనిపించేలా ఓ సెటప్ను ఏర్పాటు చేశారు. ‘గోల్డ్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రారంభించిన ఈ బండి వద్దకు వచ్చిన వారికి, ఐస్క్రీమ్ ఇచ్చినట్లుగా బంగారాన్ని అందిస్తున్నారు. పాత రోజుల్లో రోడ్లపైనే బంగారం అమ్మేవారనే కాన్సెప్ట్తో ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ బండిని చూసిన జనం ఆసక్తిగా అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ బండిపై కేవలం రూ.800కే బంగారు నాణెం అందిస్తుండటం విశేషం. దీనిపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు కూడా లేవని చెబుతున్నారు. దాంతో చాలామంది ఆసక్తిగా కొనుగోలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఈ బండిపై కేవలం తక్కువ విలువైన బంగారు వస్తువులను మాత్రమే విక్రయానికి ఉంచారు. ఖరీదైన ఆభరణాలన్నీ షోరూమ్లలోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ నెల 11, 12 తేదీల్లో ఈ బండిని ఏర్పాటు చేయగా, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మళ్లీ 18, 19, 20 తేదీల్లో కూడా అందుబాటులో వుంచుతామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ విక్రయాలు జరుపుతున్నారు. కాగా, ఈ బండిపై బంగారం అమ్మకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.