Shiv Sena: ముంబైను లాక్కునేందుకే అమరావతి బిల్లు.. కేంద్రంపై శివసేన తీవ్ర ఆరోపణలు
ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2026’ మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లును అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో దేశ ఆర్థిక రాజధాని ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) వర్గం సంచలన ఆరోపణలు చేసింది. తమ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు, పేర్లు మార్చే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునే హక్కు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని శివసేన గుర్తుచేసింది. అమరావతి బిల్లు ద్వారా కేంద్రం ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది ప్రమాదకరమైన పోకడ అని విమర్శించింది. అమరావతి విషయంలో అనుసరించిన ఈ "అండర్గ్రౌండ్ టన్నెల్" విధానాన్నే భవిష్యత్తులో ముంబై విషయంలో ప్రయోగించి, మహారాష్ట్ర అధికారాలను నీరుగార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ముంబైను చేజిక్కించుకోవడానికి కేంద్రం అనుసరించబోయే వ్యూహాన్ని కూడా ‘సామ్నా’ వివరించింది. ముందుగా "ముంబై జాతీయ ఆర్థిక మండలి" (National Economic Zone) పేరుతో ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని, నగరం యొక్క అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొగుడుతూనే, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేయవచ్చని ఆరోపించింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్ వంటి వారు దీనిని ముంబైకి గర్వకారణంగా అభివర్ణిస్తారని ఎద్దేవా చేసింది.
మహారాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన శివసేన
మహారాష్ట్ర ప్రస్తుత నాయకత్వానికి "మహారాష్ట్ర ఆత్మాభిమానం" లేదని, వారు బలహీనంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 106 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న ముంబై అస్తిత్వాన్ని కాపాడటంలో నేటి పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టింది. అమరావతిలో వేల ఎకరాలు సేకరించి, వందల కోట్లు ఖర్చు చేసినా నేటికీ నిర్మాణాల అస్థిపంజరాలే మిగిలాయని, కేవలం చట్టం చేసినంత మాత్రాన నగరం అభివృద్ధి చెందదని విమర్శించింది. ప్రస్తుత నాయకత్వం ఇలాగే మౌనంగా ఉంటే, భవిష్యత్తులో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేయడానికి వారే అనుమతిస్తారని ‘సామ్నా’ హెచ్చరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు, పేర్లు మార్చే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునే హక్కు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని శివసేన గుర్తుచేసింది. అమరావతి బిల్లు ద్వారా కేంద్రం ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది ప్రమాదకరమైన పోకడ అని విమర్శించింది. అమరావతి విషయంలో అనుసరించిన ఈ "అండర్గ్రౌండ్ టన్నెల్" విధానాన్నే భవిష్యత్తులో ముంబై విషయంలో ప్రయోగించి, మహారాష్ట్ర అధికారాలను నీరుగార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ముంబైను చేజిక్కించుకోవడానికి కేంద్రం అనుసరించబోయే వ్యూహాన్ని కూడా ‘సామ్నా’ వివరించింది. ముందుగా "ముంబై జాతీయ ఆర్థిక మండలి" (National Economic Zone) పేరుతో ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని, నగరం యొక్క అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొగుడుతూనే, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేయవచ్చని ఆరోపించింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్ వంటి వారు దీనిని ముంబైకి గర్వకారణంగా అభివర్ణిస్తారని ఎద్దేవా చేసింది.
మహారాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన శివసేన
మహారాష్ట్ర ప్రస్తుత నాయకత్వానికి "మహారాష్ట్ర ఆత్మాభిమానం" లేదని, వారు బలహీనంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 106 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న ముంబై అస్తిత్వాన్ని కాపాడటంలో నేటి పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టింది. అమరావతిలో వేల ఎకరాలు సేకరించి, వందల కోట్లు ఖర్చు చేసినా నేటికీ నిర్మాణాల అస్థిపంజరాలే మిగిలాయని, కేవలం చట్టం చేసినంత మాత్రాన నగరం అభివృద్ధి చెందదని విమర్శించింది. ప్రస్తుత నాయకత్వం ఇలాగే మౌనంగా ఉంటే, భవిష్యత్తులో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేయడానికి వారే అనుమతిస్తారని ‘సామ్నా’ హెచ్చరించింది.