Hardik Pandya: ముంబై-కేకేఆర్ మ్యాచ్ లో టాస్ పై అనుమానాలు... నెటిజన్ల ఆగ్రహం
ఐపీఎల్ 2026 సీజన్లో మరో వివాదం రాజుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (ఎంఐ), కోల్కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రసారంలో సాంకేతిక లోపం కారణంగా టాస్ ఫలితం స్పష్టంగా కనిపించకపోవడంతో, ముంబైకి అనుకూలంగా నిర్ణయం వెలువడిందని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ కోసం నాణేన్ని గాల్లోకి ఎగరేశాడు. కోల్కతా కెప్టెన్ అజింక్యా రహానే 'టెయిల్స్' అని కాల్ చేశాడు. అయితే, నాణెం కింద పడిన సమయంలో మ్యాచ్ రెఫరీ దానిని తీసుకోబోతుండగా, కెమెరా యాంగిల్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నాణెం హెడ్ పడిందా లేక టెయిల్ పడిందా అనే విషయం ప్రేక్షకులకు కనిపించలేదు. వెంటనే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది.
ఈ ఘటనపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. "హార్దిక్ టాస్ వేశాడు, కానీ ఫలితం చూడలేదు. అయినా ముంబై గెలిచింది. ఇలాంటి అద్భుతాలు ముంబైకే సాధ్యం" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరోవైపు, "ఐపీఎల్ ప్రసార హక్కులున్న సంస్థ (జియో హాట్ స్టార్), ముంబై ఇండియన్స్ యాజమాన్యం (రిలయన్స్) ఒకటే కావడం వల్ల ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి" అంటూ మరికొందరు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోణాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు.
కాగా, ఈ వివాదంపై ఆటగాళ్లు గానీ, అంపైర్లు గానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, సీజన్ ఆరంభంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (67), అంక్రిష్ రఘువంశి (51) అర్ధశతకాలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
వివరాల్లోకి వెళితే, ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ కోసం నాణేన్ని గాల్లోకి ఎగరేశాడు. కోల్కతా కెప్టెన్ అజింక్యా రహానే 'టెయిల్స్' అని కాల్ చేశాడు. అయితే, నాణెం కింద పడిన సమయంలో మ్యాచ్ రెఫరీ దానిని తీసుకోబోతుండగా, కెమెరా యాంగిల్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నాణెం హెడ్ పడిందా లేక టెయిల్ పడిందా అనే విషయం ప్రేక్షకులకు కనిపించలేదు. వెంటనే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది.
ఈ ఘటనపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. "హార్దిక్ టాస్ వేశాడు, కానీ ఫలితం చూడలేదు. అయినా ముంబై గెలిచింది. ఇలాంటి అద్భుతాలు ముంబైకే సాధ్యం" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరోవైపు, "ఐపీఎల్ ప్రసార హక్కులున్న సంస్థ (జియో హాట్ స్టార్), ముంబై ఇండియన్స్ యాజమాన్యం (రిలయన్స్) ఒకటే కావడం వల్ల ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి" అంటూ మరికొందరు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోణాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు.
కాగా, ఈ వివాదంపై ఆటగాళ్లు గానీ, అంపైర్లు గానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, సీజన్ ఆరంభంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (67), అంక్రిష్ రఘువంశి (51) అర్ధశతకాలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు.